27 Jul 2014

2014 గురుపూజల ఫోటోలు

2014 గురుపూజల ఫోటోలు 

"సజ్జన ధార్మిక వేదిక" నిర్వహించిన 31వ శ్రీ వ్యాస జయంతి కార్యక్రమ విశేషాలు 12-7-2014

"సజ్జన ధార్మిక వేదిక" ...... నాన్నగారు (ఐ.వి. గోపాలాచార్యులు) ఈ సంస్థను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో వచ్చే గురుపౌర్ణమికి ఎవరో ఒకరిని.... పెద్దలని ఆహ్వానించి, వారికి పాదపూజ చేసి, సన్మానించటం ఇన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ సంవత్సరం.... జూలై 12 శనివారంనాడు ..... విశాఖపట్నంలో, శ్రీహరిపురంలో, జవహర్ నగర్ లో వేంచేసియున్న "శ్రీరాధావేణుగోపాలస్వామి" ఆలయంలో మూడు రోజులు పలు ఆధ్యాత్మిక జరిగిన 31వ గురు పౌర్ణమికి డాll బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రిగారికి పాదపూజ చేసి, సన్మానించటం జరిగింది.


ఈ 31 సంవత్సరాలుగా సజ్జన ధార్మిక వేదిక సంస్థని స్థాపించి, కొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినందుకుగాను వారు నాన్నగారికి కూడా ఈ సంవత్సరం సన్మానం చేసారు.


మాతృమండలి సభ్యులు, మిగిలిన శిష్యబృందంతో అమ్మ - నాన్నలు 


కార్యక్రమాలకి విచ్చేసిన భక్తజనం